Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ మంతనాలు .. రాజ్యసభకు మెగా బ్రదర్!!

ఠాగూర్
గురువారం, 28 నవంబరు 2024 (15:03 IST)
ఢిల్లీ పర్యటనలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కీలక మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది. ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో ఒకదాన్ని తమ అన్న, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు నాగబాబుకు ఇచ్చేలా బీజేపీ పెద్దలను ఒప్పించినట్టు సమాచారం. దీంతో మెగా బ్రదర్ నాగబాబు రాజ్యసభ సభ్యుడుగా పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన వైకాపాకు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు తమ సభ్యత్వాలకు వేర్వేరు కారణాలతో రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఈ నేపథ్యంలో జనసేన నుంచి నాగబాబును పెద్దల సభకు పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నపుడే ఈ విషయంపై స్పష్టత వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ రాజ్యసభ ఎన్నికల కోసం వచ్చే నెల మూడో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై పదో తేదీన ముగుస్తుంది. 13వ తేదీన నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. 20వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు. 
 
అయితే, ప్రస్తుతం ఏపీలో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలో ఉండటంతో ఈ మూడు స్థానాలు కూటమి అభ్యర్థులకు దక్కడం ఖాయంగా తెలుస్తుంది. ఒక అభ్యర్థి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వైకాపా కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన ఆ పార్టీ బరిలో నిలిచే అవకాశమే లేదు. సో.. కూటమి తరపున పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలుపొందటం ఖాయంగా కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments