Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలిచినా.. ఓడినా... దాన్ని మాత్రం వదలను : నాగబాబు

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:42 IST)
జనసేన పార్టీ నేత, నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముగిసిన తొలిదశ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేశారు. ఈనెల 11వ తేదీన పోలింగ్ ముగిసింది. గత నెల రోజుల పాటు తీరకలేకుండా ప్రచారం చేసి అలసిపోయిన నాగబాబు.. ఇపుడు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
మరోవైపు, ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్న జబర్దస్త్ హాస్యభరిత కార్యక్రమం ప్రముఖ టీవీలో కొన్నేళ్లుగా సాగుతోంది. ఈ షోకు నాగబాబుతో పాటు వైకాపా మహిళా నేత ఆర్.కె.రోజా కూడా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ షో నాన్‌స్టాప్‌గా నవ్వులు పూయించడంలో ఈ ఇద్దరి పాత్ర ఎంతో వుంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టిపెట్టి, జబర్దస్త్ కార్యక్రమానికి దూరమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'జబర్దస్త్' అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి అది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నెలకి నాలుగు రోజులు మాత్రమే షూటింగు ఉంటుంది. ఆ నాలుగు రోజులు ఎలాగో అలా నేను సర్దుబాటు చేసుకుంటాను. ఒకవేళ ఎంపీగా గెలిచినా ఈ షో చేయడం మానుకోను. న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే ఉంటాను. రాజకీయ రంగంలో ఒకవైపున పదవులు నిర్వహిస్తూనే.. మరో వైపున టీవీ షోలకి న్యాయనిర్ణేతలుగా పనిచేసిన వాళ్లు చాలామందే వున్నారు అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments