Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే రేషన్ బియ్యం అక్రమార్కుల అరెస్టులు : మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

ఠాగూర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (16:19 IST)
ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పేదలకు సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసి అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నవారిని గుర్తించి అరెస్టు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి  నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన బుధవారం కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. ఇందులో అక్రమంగా నిల్వవుంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేయడానికి వీల్లేదని పోర్టు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇదే అంశంప ఆయన మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చే రేషన్ బియ్యాన్ని కొందరు రాజకీయ నేతలు స్మగ్లర్లతో చేతులు కలిపి విదేశాలకు అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారని, ఇలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా, 41ఏ కింద నోటీసులు జారీచేసి రేషన్ బియ్యం అక్రమంగా తరలించిన వారిని అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. 
 
కాగా, పౌరసరఫరాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాకినాడలో ఆయన విస్తృతంగా పర్యటించి అనేక రేషన్ షాపులను పరిశీలించారు. అలాగే, జిల్లా కేంద్రంలో అక్రమంగా నిల్వవుంచిన వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన గోదాముల్లోని రేషన్ బియ్యాన్ని స్వాధీన చేసుకుని సీజ్ చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments