Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంగారెడ్డి గూడెంలో వరుస మరణాల కలకలం

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (19:37 IST)
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా 18 మంది మృత్యువాతడటం ఈ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 
 
తొలి మరణం సంభవించినపుడు కల్తీకల్లు తాగి చనిపోయారని భావించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఎక్కడా కూడా కల్తీ కల్లు ఆనవాళ్ళు కనిపిచలేదు. ఆ తర్వాత మరికొందరు ప్రాణాలు విడిచారు. ఈ అంశంపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చ జరిగింది. 
 
అయితే, రోజురోజుకూ ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టినిసారించింది. వరుస మరణాలకు కారణాలు ఏంటో అన్వేషించే పనిలో నిమగ్నమైంది. జిల్లా వైద్యాధికారులతో పాటు పోలీసులు, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో తదితర విభాగాలు ఈ వరుస మరణాల వెనుక ఉన్న మిస్టరీని గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి.
 
అయితే వైద్యులు మాత్రం కిడ్నీల సమస్యలతో వస్తున్న ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే చనిపోతున్నట్టు ఓ అంచనాకు వచ్చారు. అందుకు మద్యం సేవించడం, దాని ప్రభావం కిడ్నీలపై పడటంతో ఈ సమస్య తలెత్తుతున్నట్టు తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments