Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంగారెడ్డి గూడెంలో వరుస మరణాల కలకలం

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (19:37 IST)
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా 18 మంది మృత్యువాతడటం ఈ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 
 
తొలి మరణం సంభవించినపుడు కల్తీకల్లు తాగి చనిపోయారని భావించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఎక్కడా కూడా కల్తీ కల్లు ఆనవాళ్ళు కనిపిచలేదు. ఆ తర్వాత మరికొందరు ప్రాణాలు విడిచారు. ఈ అంశంపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చ జరిగింది. 
 
అయితే, రోజురోజుకూ ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టినిసారించింది. వరుస మరణాలకు కారణాలు ఏంటో అన్వేషించే పనిలో నిమగ్నమైంది. జిల్లా వైద్యాధికారులతో పాటు పోలీసులు, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో తదితర విభాగాలు ఈ వరుస మరణాల వెనుక ఉన్న మిస్టరీని గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి.
 
అయితే వైద్యులు మాత్రం కిడ్నీల సమస్యలతో వస్తున్న ఇతర అనారోగ్య సమస్యల కారణంగానే చనిపోతున్నట్టు ఓ అంచనాకు వచ్చారు. అందుకు మద్యం సేవించడం, దాని ప్రభావం కిడ్నీలపై పడటంతో ఈ సమస్య తలెత్తుతున్నట్టు తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments