Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆలంపురంలో కుమారి అనుమానాస్ప‌ద మృతి.... వెనుక ఎవ‌రి హ‌స్తం?

ఆలంపురంలో కుమారి అనుమానాస్ప‌ద మృతి.... వెనుక ఎవ‌రి హ‌స్తం?
విజ‌య‌వాడ‌ , సోమవారం, 24 జనవరి 2022 (19:03 IST)
డలం 
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ఆలంపురం గ్రామంలో మహిళ ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె పేరు దేవేళ్ళ మేరీ ప్రసన్న కుమారి(30). ఆలంపురం గ్రామానికి చెందిన ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి మరో వ్యక్తి కలిసి మృతి చెందిన మహిళ దగ్గర అప్పులు తీసుకుని ఆమెను వేధింపులకు గురిచేయడంతో ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం.
 
 
ఆమె మృతికి కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాహేతర సంబంధం కలిగిన వ్యక్తి ఆలంపురం గ్రామానికి చెందిన ప్రతిపక్ష నేత కలిసి ఆమె మృతికి కారణమయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. నిందితులకు ఊరిలో రాజకీయ అండదండలు ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చేందుకు మృతురాలి బంధువులు సాహసించడం లేదు. గతంలోనూ ఇదే వ్యక్తుల వల్ల ఆలంపురం పలు మహిళలు ఇదే స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. 
 
 
మృతురాలు వాయిస్ పేరుమీద ఓ ఆడియో రికార్డు బయటకు వచ్చింది. అందులో ఆమెను భయపెట్టి వాయిస్ చెప్పించారని ప్రచారం జ‌రుగుతోంది. ఆమె బంధవులను భయపెట్టి విషయం బయటకు పొక్కకుండా చేసారంటూ ఆరోపణలు వ‌స్తున్నాయి. ఇటువంటి ఘటనలకు కారణమయిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలంపురం గ్రామ వాసులు కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్ర‌భుత్వంతో ప్ర‌తిష్ఠంభ‌న వ‌ద్దు... అపోహ‌లుంటే మాట్టాడండి...