Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం..

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (08:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడు అంచెల భద్రను కల్పించారు. దీంతో అన్ని పార్టీలన్నీ అటెన్షన్‌లోకి వెళ్లిపోయాయి. 
 
ఈ ఓట్ల లెక్కింపునకు మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల లోపు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. రౌండ్ల వారీగా ఫలితాలను కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లలో ప్రదర్శిస్తారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉన్న మునుగోడు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 15 రౌండ్లలో పూర్తికానుమంది. 
 
తుది ఫలితాన్ని 3 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఓట్ల లెక్కింపు మాత్రం మధ్యాహ్నం 12 గంటలకే పూర్తికానుంది. కాగా, ఈ నెల 3వ తేదీన జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైన విషయం తెల్సిందే. మొత్తం 241805 ఓట్లకుగాను 225192 ఓట్లు పోలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments