Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతులు మహాపాదయాత్రకు ముహూర్తం ఖరారు

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (09:49 IST)
రాజధాని కోసం అమరావతి రైతులు ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి మహా పాదయాత్రకు ప్లాన్ చేశారు. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి వరకు ఈ పాదయాత్ర నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఈ పాదయాత్ర ప్రారంభ ముహూర్తాన్ని రైతులు ఫిక్స్ చేశారు. 
 
అయితే, ఈ పాదయాత్రకు ఏపీ పోలీసులు తొలుత అనుమతి నిరాకరించారు. దీంతో అమరావతి రైతుల పరిక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ పాదయాత్రను 12వ తేదీన వేకువజామున 5 గంటలకు మూహుర్తం ఖరారు చేశారు. 
 
ఈ యాత్ర ప్రారంభానికి ముందు వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామి రథాన్ని ఆరు గంటలకు వెంకటపాలెం గ్రామానికి తీసుకొస్తారు. 9 గంటలకు రథానిక జెండా ఊపి లాంఛనంగా యాత్రను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి అధికార వైకాపా పార్టీ నేతలు మినహా మిగిలిన పార్టీలకు చెందిన నేతలంతా హాజరుకానున్నారు. 
 
ముఖ్యంగా, టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, ఆప్, కాంగ్రెస్ పార్టీలతో ఇతర చిన్నాచితక పార్టీల నేతలను కూడా ఆహ్వానించారు. తొలి రోజు యాత్ర వెంకటపాలెం నుంచి కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొనేవారి వివరాలను అమరావతి పరిరక్షణ సమితి నేతలు డీజీపీ కార్యాలయంలో సమర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments