Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవంతంగా సాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర - 38 కిమీ పూర్తి

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (09:22 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఈ యాత్రలో భాగంగా ఇప్పటివరకు మూడు రోజుల యాత్ర ముగిసింది. ఆయన మొత్తం 38 కిలోమీటర్ల మేరకు నడిచారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు చేపట్టిన ఈ యాత్రను తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించారు. 
 
వచ్చే 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయాత్తం చేసేందుకు వీలుగా ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. శుక్రవారంతో మూడో రోజు ముగిసింది. మూడో రోజు యాత్ర శుక్రవారంతో ముగిసిందని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ ప్రకటన ప్రకారం మూడో రోజు పాదయాత్ర ముగిసే సరికే రాహుల్ గాంధీ 38 కిలోమీటర్ల నడకను పూర్తి చేశారు. ఈ యాత్ర ఇంకా కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లోనే ఉంది. మొత్తం 152 రోజు పాటు సాగనుంది. ఇందులో రాహుల్ గాంధీ ఏకంగా 3570 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments