Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమవరానికి రాని ఆర్ఆర్ఆర్ - రైలు దిగి వెనక్కి పయనం

Webdunia
సోమవారం, 4 జులై 2022 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం పర్యటించనున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా వస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఆయన ఈ కార్యక్రమానికి రాకుండానే వెనక్కి వెళ్ళారు. 
 
ప్రధాని మోడీ పర్యనటలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్న రఘురామ.. అక్కడ నుంచి భీమవరం వెళ్లేందుకు గత రాత్రి హైదరాబాద్ నగరంలో రైలు ఎక్కారు. ఈ క్రమంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. 
 
శనివారం ఆయనకు మద్దతుగా భీమవరంలో ర్యాలీ నిర్వహించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారన్నది సమాచారం. యువకుల తల్లిదండ్రులో ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. 
 
దీంతో మనస్తాపం చెందిన రఘురామ మధ్యలోనే రైలు దిగి వెనక్కి వెళ్లిపోయారు. ప్రొటోకాలో విషయంలో అధికారులు తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. యువకులపై కేసు పెట్టడం రఘురామను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. అందుకే భీమవరం రాకుండా ఆయన వెనక్కి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments