Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమవరానికి రాని ఆర్ఆర్ఆర్ - రైలు దిగి వెనక్కి పయనం

Webdunia
సోమవారం, 4 జులై 2022 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం పర్యటించనున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా వస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఆయన ఈ కార్యక్రమానికి రాకుండానే వెనక్కి వెళ్ళారు. 
 
ప్రధాని మోడీ పర్యనటలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్న రఘురామ.. అక్కడ నుంచి భీమవరం వెళ్లేందుకు గత రాత్రి హైదరాబాద్ నగరంలో రైలు ఎక్కారు. ఈ క్రమంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. 
 
శనివారం ఆయనకు మద్దతుగా భీమవరంలో ర్యాలీ నిర్వహించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారన్నది సమాచారం. యువకుల తల్లిదండ్రులో ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. 
 
దీంతో మనస్తాపం చెందిన రఘురామ మధ్యలోనే రైలు దిగి వెనక్కి వెళ్లిపోయారు. ప్రొటోకాలో విషయంలో అధికారులు తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. యువకులపై కేసు పెట్టడం రఘురామను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. అందుకే భీమవరం రాకుండా ఆయన వెనక్కి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"కాంతార" సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

Karthik Raju: సరికొత్తగా విలయ తాండవం వుంటుందన్న కార్తీక్ రాజు

Nani 34: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ చిత్రం ప్రారంభం

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా పురుష చిత్రీకరణ పూర్తి

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం దసరా కు ముహూర్తం.. అక్టోబర్ 24న షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments