Webdunia - Bharat's app for daily news and videos

Install App

భీమవరానికి రాని ఆర్ఆర్ఆర్ - రైలు దిగి వెనక్కి పయనం

Webdunia
సోమవారం, 4 జులై 2022 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం పర్యటించనున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా వస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఆయన ఈ కార్యక్రమానికి రాకుండానే వెనక్కి వెళ్ళారు. 
 
ప్రధాని మోడీ పర్యనటలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్న రఘురామ.. అక్కడ నుంచి భీమవరం వెళ్లేందుకు గత రాత్రి హైదరాబాద్ నగరంలో రైలు ఎక్కారు. ఈ క్రమంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. 
 
శనివారం ఆయనకు మద్దతుగా భీమవరంలో ర్యాలీ నిర్వహించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారన్నది సమాచారం. యువకుల తల్లిదండ్రులో ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. 
 
దీంతో మనస్తాపం చెందిన రఘురామ మధ్యలోనే రైలు దిగి వెనక్కి వెళ్లిపోయారు. ప్రొటోకాలో విషయంలో అధికారులు తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. యువకులపై కేసు పెట్టడం రఘురామను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. అందుకే భీమవరం రాకుండా ఆయన వెనక్కి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments