Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు షోకాజ్ నోటీసు పంపించడానికి విజయసాయి రెడ్డి ఎవరు? వైకాపా ఎంపీ

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (13:30 IST)
గత కొంతకాలంగా అధిష్టానంపై విమర్శలు చేస్తున్న వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు సోమవారం వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఆరు పేజీలతో కూడిన లేఖ పంపించారు. ఇందులో అసలు విజయసాయిరెడ్డి ఎవరు అంటూ నిలదీశారు. తనకు లేఖ పంపడానికి విజయసాయి రెడ్డి ఎవరు అని నిలదీశారు. 
 
ఏపీ సీఎం జగన్‌కు వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మొత్తం 6 పేజీల లేఖను పంపారు. ఈ మధ్య విజయసాయిరెడ్డి నుంచి నోటీసు అందిందని, ఆయన లేఖకు స్పందిస్తూ రిప్లై ఇస్తున్నట్లు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. సీ ఓటర్‌ సర్వేలో 4వ స్థానం వచ్చినందుకు జగన్‌కు అభినందనలు తెలిపారు. త్వరలో మొదటి స్థానం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. 
 
అలాగే తనకు లేఖ పంపించడానికి విజయసాయిరెడ్డి  ఎవరంటూ నిలదీశారు. రిజిస్టరయిన పార్టీ పేరుతో కాకుండా మరో పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసు అందిందని తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని.. పలు సందర్భాల్లో ఈసీ మన పార్టీకి రాసిన లేఖలు దీన్ని స్పష్టం చేస్తున్నాయని గుర్తుచేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరును ఏ సందర్భంలోనూ వాడుకునే అవకాశం లేదని ఈసీ తేల్చి చెప్పిందని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments