అదే నిజమైతే జగన్ బయట తిరిగేవారా? కంటే కూతుర్నే కనాలి : ఆర్ఆర్ఆర్

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (15:21 IST)
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన, చేస్తున్న వ్యాఖ్యలపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. సీబీఐ - చంద్రబాబు నాయుడు కుమ్మక్కైతే 35కి పైగా అవినీతి కేసుల్లో చిక్కుకుని బెయిల్‌పై తిరుగుతున్న వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా బయట తిరుగుతారా? కోర్టుకు వెల్లకుండా ఉండేవారా? అని అడిగారు. 
 
ఇకపోతే ఈ నెల 25వ తేదీ వరకు వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ సీబీఐను తెలంగాణ హైకోర్టు ఆదేశించడాన్ని దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సుప్రంకోర్టును ఆశ్రయించడం స్వాగతించదగిన విషయమన్నారు. కంటే కూతురునే కనాలి అని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పుపై ఇదేమి తీర్పు అని ప్రజలు అనుకుంటున్నారని, కానీ, న్యాయస్థానాలపై నమ్మకం ఉంచాలని ఆయన కోరారు. అదేసమయంలో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని అవినాష్ రెడ్డి ఊహించకపోయి ఉండొచ్చని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments