Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జగన్ సతీమణి భారతీ రెడ్డికి భాస్కర్ రెడ్డి ఏ వరుసన మేనమామ అవుతారు?

ys bharati
, సోమవారం, 17 ఏప్రియల్ 2023 (08:58 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తుది అంకానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇందులోభాగంగా, ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుల్లో ఒకరైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీ రెడ్డికి స్వయానా మేనమామ. ఈ వరుస ఎలా కలిసిందే ఓసారి పరిశీలిద్ధాం. 
 
భారతి రెడ్డి తల్లి ఈసీ సుగుణమ్మకు భాస్కర్ రెడ్డి సోదరుడు. మరోపక్క భాస్కర్‌రెడ్డి భార్య లక్ష్మి కూడా భారతి రెడ్డికి మేనత్త అవుతారు. భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి సోదరే లక్ష్మి. వీరు కుండమార్పిడి వివాహాలు చేసుకున్నారు. వై.ఎస్‌.వెంకట రెడ్డికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మ కుమారుడైన చిన్న కొండారెడ్డి తొమ్మిదో కుమారుడు వై.ఎస్‌.భాస్కర రెడ్డి (అవినాష్‌రెడ్డి తండ్రి). ఆరో కుమార్తె ఈసీ సుగుణమ్మ (భారతి తల్లి).
 
వై.ఎస్‌.వెంకటరెడ్డి రెండో భార్య మంగమ్మ అయిదో కుమారుడు వై.ఎస్‌.రాజారెడ్డి. ఆయన కుమారులు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, వై.ఎస్‌.వివేకానందరెడ్డి. వై.ఎస్‌.భాస్కర్ రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌కు సమీప బంధువు. వరసకు చిన్నాన్న. జగన్‌ భార్య భారతికి అత్యంత దగ్గరి కుటుంబీకుడు. వై.ఎస్‌.భారతి తల్లి ఈసీ సుగుణమ్మ.. వై.ఎస్‌.అవినాష్‌ రెడ్డికి మేనత్త అవుతారు. అవినాష్‌ రెడ్డి తల్లి లక్ష్మి.. భారతికి మేనత్త అవుతారు. అందుకే కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్‌ ఆప్యాయత. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటకలో బీజేపీకి మరో భారీ షాక్... కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న జగదీష్ షెట్టర్