మోత్కుపల్లికి కరోనా వైరస్ : పరిస్థితి విషమం

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (11:26 IST)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మోత్కుపల్లి నరసింహులుకు క‌రోనా సోక‌డంతో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌, సోమాజిగూడ‌లోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. అయితే, నిన్న రాత్రి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఐసీయూకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అప్ప‌ట్లో టీడీపీ హయాంలో ఆయ‌న‌ మంత్రిగా పనిచేసిన విష‌యం తెలిసిందే. 2008లో ఆయ‌న‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
 
రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కొన్నేళ్లు టీడీపీలో కొన‌సాగిన ఆయ‌న అనంత‌రం ఆ పార్టీకి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసి హాట్ టాపిక్‌గా మారారు. దీంతో ఆయ‌న‌ను టీడీపీ అప్ప‌ట్లో పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. అనంత‌రం ఏపీలో టీడీపీ ఓడిపోవాల‌ని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బీజేపీలో చేరారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments