Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోత్కుపల్లికి కరోనా వైరస్ : పరిస్థితి విషమం

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (11:26 IST)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన మోత్కుపల్లి నరసింహులుకు క‌రోనా సోక‌డంతో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌, సోమాజిగూడ‌లోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. అయితే, నిన్న రాత్రి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఐసీయూకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అప్ప‌ట్లో టీడీపీ హయాంలో ఆయ‌న‌ మంత్రిగా పనిచేసిన విష‌యం తెలిసిందే. 2008లో ఆయ‌న‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
 
రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కొన్నేళ్లు టీడీపీలో కొన‌సాగిన ఆయ‌న అనంత‌రం ఆ పార్టీకి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసి హాట్ టాపిక్‌గా మారారు. దీంతో ఆయ‌న‌ను టీడీపీ అప్ప‌ట్లో పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. అనంత‌రం ఏపీలో టీడీపీ ఓడిపోవాల‌ని ఆయ‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఆయన బీజేపీలో చేరారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments