Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త లేడు.. సహజీవనం చేసింది.. పిల్లలకు ఉరేసింది.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (09:17 IST)
భర్త లేడు.. సహజీవనం చేసినా ఫలితం లేదు. అంతే ఏమనుకుందో ఏమో కానీ ఆ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరేసి హత్య చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆనంద్‌నగర్‌లో బ్యుటీషియన్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అనూషకు ఒక కూతురు చిన్మయి(8), ఒక కుమారుడు మోహిత్‌(6) ఉన్నారు. 13 ఏండ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె తాడేపల్లి నుంచి రాజమండ్రి వచ్చి జీవిస్తోంది. 
 
అలాగే కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి ఆమె తన పిల్లకు ఉరివేసి చంపేసింది. అనంతరం ప్రియుడికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అరెస్టు చేశారు. చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
అయితే తన కుటుంబ పరిస్థితి బాగోలేదని, పిల్లలకు తిండిపెట్టలేక చంపేశానని అనూష చెబుతోంది. కానీ ఆమెకు ఆర్థిక ఇబ్బందులు లేవని, ఈ హత్యలకు వేరే కారణం ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనూష తరచూ పిల్లలను కొడుతుండేదని తెలిసింది. దాంతో ఆమె తల్లి కనకదుర్గ ఒకసారి ఆమెను మందలించగా అందుకు తల్లిపై కూడా అనూష దాడి చేసిందని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments