Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త లేడు.. సహజీవనం చేసింది.. పిల్లలకు ఉరేసింది.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (09:17 IST)
భర్త లేడు.. సహజీవనం చేసినా ఫలితం లేదు. అంతే ఏమనుకుందో ఏమో కానీ ఆ వివాహిత తన ఇద్దరు పిల్లలకు ఉరేసి హత్య చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆనంద్‌నగర్‌లో బ్యుటీషియన్‌గా పనిచేస్తున్న లక్ష్మీ అనూషకు ఒక కూతురు చిన్మయి(8), ఒక కుమారుడు మోహిత్‌(6) ఉన్నారు. 13 ఏండ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె తాడేపల్లి నుంచి రాజమండ్రి వచ్చి జీవిస్తోంది. 
 
అలాగే కొంతకాలంగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి ఆమె తన పిల్లకు ఉరివేసి చంపేసింది. అనంతరం ప్రియుడికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అరెస్టు చేశారు. చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
అయితే తన కుటుంబ పరిస్థితి బాగోలేదని, పిల్లలకు తిండిపెట్టలేక చంపేశానని అనూష చెబుతోంది. కానీ ఆమెకు ఆర్థిక ఇబ్బందులు లేవని, ఈ హత్యలకు వేరే కారణం ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనూష తరచూ పిల్లలను కొడుతుండేదని తెలిసింది. దాంతో ఆమె తల్లి కనకదుర్గ ఒకసారి ఆమెను మందలించగా అందుకు తల్లిపై కూడా అనూష దాడి చేసిందని తెలిసింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments