Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవరాజ్ పంపిన మెసేజ్‌లు చదివాకే.. శ్రావణి బాత్రూమ్‌లో ఉరేసుకుంది.. శ్రావణి తల్లి

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (14:26 IST)
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం అయిన విషయం తెలిసిందే. దేవరాజ్, సాయి, అశోక్ రెడ్డి.. ఈముగ్గురులో శ్రావణి ఎవరు వలన ఆత్మహత్య చేసుకుంది అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే.. శ్రావణి తల్లి పాపారత్నం సంచలన విషయాలను బయటపెట్టింది. ఇంతకీ శ్రావణి తల్లి పాపారత్నం ఏం చెప్పిందంటే... 
శ్రావణిని ప్రేమ పేరుతో దేవరాజు మోసం చేశాడు. 
 
జూన్‌లో దేవరాజు పై కేసు పెట్టాం. దేవరాజుపై కేసు నమోదైన తరువాత అనేక డ్రామాలు ఆడాడు. లాక్‌డౌన్‌ తరువాత కోర్టులు తెరిస్తే కేసు కాంప్రమైజ్ చేసేందుకు మళ్ళీ ప్రేమ నాటకాలు ఆడాడు.
 
 ప్రేమ పేరుతో శ్రావణిని మాయలో పడేశాడు. అతన్ని గుడ్డిగా నమ్మింది. కేసు కొట్టించేయడం కోసం శ్రావణిని అన్ని రకాలుగా మోసం చేశాడు‌. కేసు కొట్టి వేసే క్రమంలో దేవరాజు శ్రావణి పై అఘాయిత్యానికి పాల్పడతాడేమోనని సాయి కృష్ణను అండగా ఉంచాం. 
 
హోటల్‌కి వెళ్ళినప్పుడు శ్రావణిని తీసుకురమ్మని నేనే సాయికృష్ణ పంపించాను. శ్రావణి స్నానం చేస్తానని బాత్రూమ్‌లోకి వెళ్ళిన కొద్దిసేపటికే దేవరాజు నుండి కాల్‌తో పాటు మెసేజ్ కూడా వచ్చింది. కొద్దిసేపటికే మళ్లీ ఆ మెసేజ్ డిలీట్ చేశాడు. ఆ మెసేజ్ చదివిన శ్రావణి బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటాడు అని శ్రావణి తల్లి పాపారత్నం చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments