Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కాటుకు ఇద్దరు కవల పిల్లలు మృతి.. ఎక్కడంటే..?

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (13:28 IST)
పాము కాటుకు ఇద్దరు కవల పిల్లలు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లోగల మర్ద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోట్నామర్ద్ గ్రామంలో కవలలు మృతి చెందారు. ఈ బాలికల మృతి స్థానికంగా సంచలనం రేపింది. వారి మృతికి కారణం తెలియగానే అక్కడున్నవారంతా హతాశులైపోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. కవలలు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఏడుస్తుండగా, తండ్రి వారిద్దరికీ గ్లాసుతో పాలు పట్టించాడు. పాలు తాగిన కొద్దిసేపటికే ఆ చిన్నారులిద్దరి నోటి నుంచి నురగలు రాసాగాయి. విషయం తెలియగానే చుట్టుపక్కల వారంతా బాధిత చిన్నారుల ఇంటికి వచ్చారు. వారంతా ఇంటిలోని నలుమూలలా చూడగా, ఒక పాము కప్పను మింగుతూ కనిపించింది. 
 
దీంతో ఆ పాము పాలను తాగి ఉంటుందని, ఆ పాలనే చిన్నారులు తాగి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే వారు ఆ బాలికలను ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు బాలికలు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments