దేశంలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 1114 మంది మృతి

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (13:13 IST)
దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గత 24గంటల్లో కొత్తగా 94వేల 372 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47లక్షల 54వేల 356కి చేరింది. అలాగే... 24 గంటల్లో 1114 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 78వేల 586కి పెరిగింది. దేశంలో మరణాల రేటు 1.7శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 3.19 శాతంగా ఉంది.
 
దేశంలో గత 24 గంటల్లో కరోనా నుంచి 78వేల 399 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 37లక్షల 2వేల 595కి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 77.9 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9లక్షల 73వేల 175గా ఉంది. దేశంలో గత 24 గంటల్లో 10లక్షల 71వేల 702 శాంపిల్ టెస్టులు చేశారు. అలాగే... మొత్తం టెస్టుల సంఖ్య 5కోట్ల 62 లక్షల 60వేల 928కి చేరింది. 
 
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్... టాప్-2లో ఉంది. అక్టోబర్‌లో టాప్-1లోకి భారత్ వెళ్తుందంటున్నారు. రోజువారీ నమోదవుతున్న కేసుల్లో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అత్యధిక మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడోస్థానంలో ఉంది. రోజువారీ మరణాల్లో భారత్ తర్వాత బ్రెజిల్, అమెరికా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments