Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 1114 మంది మృతి

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (13:13 IST)
దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గత 24గంటల్లో కొత్తగా 94వేల 372 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 47లక్షల 54వేల 356కి చేరింది. అలాగే... 24 గంటల్లో 1114 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 78వేల 586కి పెరిగింది. దేశంలో మరణాల రేటు 1.7శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 3.19 శాతంగా ఉంది.
 
దేశంలో గత 24 గంటల్లో కరోనా నుంచి 78వేల 399 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 37లక్షల 2వేల 595కి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 77.9 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9లక్షల 73వేల 175గా ఉంది. దేశంలో గత 24 గంటల్లో 10లక్షల 71వేల 702 శాంపిల్ టెస్టులు చేశారు. అలాగే... మొత్తం టెస్టుల సంఖ్య 5కోట్ల 62 లక్షల 60వేల 928కి చేరింది. 
 
ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్... టాప్-2లో ఉంది. అక్టోబర్‌లో టాప్-1లోకి భారత్ వెళ్తుందంటున్నారు. రోజువారీ నమోదవుతున్న కేసుల్లో భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. అత్యధిక మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడోస్థానంలో ఉంది. రోజువారీ మరణాల్లో భారత్ తర్వాత బ్రెజిల్, అమెరికా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments