Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గిపోతేనే ఫలితం ఉంటుంది.. చిరు చర్చలను స్వాగతించిన ఆర్కే రోజా

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (15:15 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు వ్యవహారం ఇపుడు తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమస్య పరిష్కారం కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా, ఆయన గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై సినీ సమస్యలపై చర్చించారు. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కావడం మంచి శుభపరిణామం అన్నారు. 
 
చిరంజీవిలా ఎవరైనా సరే సీఎంను కలిసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని తెలిపారు. అంతేకానీ రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడితే ఎవరికీ మేలు జరగదన్నారు. సమస్య పరిష్కారం కోసం సావధానంగా నడుచుకోవాలన్నారు. సినీ రంగం చెబుతున్న అన్ని అంశాల్లో న్యాయం ఉందనిపిస్తే మాత్రం సీఎం జగన్ తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. 
 
అయితే, రాష్ట్రంలోని విపక్షసభ్యులు ప్రతి అంశాన్ని రాద్దాంతం చేస్తూ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఏపీలో ఇపుడు రాజకీయం చేసేందుకు ఎలాంటి సమస్యా లేకపోవడంతో సినిమా టిక్కెట్ ధరలపై రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments