Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వాలంటీర్ల సేవలను కొనియాడిన ఎమ్మెల్యే రోజా

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:39 IST)
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల సేవలను వైసీపీ ఎమ్మెల్యే రోజా కొనియాడారు. 'దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే.. పౌరులు ఇంట్లోనే ఉంటూ కొవిడ్-19తో పోరాడుతుంటే, మన ఏపీ విలేజ్‌ వారియర్స్‌ మాత్రం.. ఇబ్బందులు పడుతున్న వారికి సాయం అందిస్తూ పని చేస్తున్నారు. హ్యాట్సాఫ్‌ టు వాలంటీర్స్‌.. పింఛనులను డోర్‌ డెలివరీ చేస్తూ గొప్ప సేవలు అందిస్తున్నారు' అని ట్వీట్ చేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో పింఛను లబ్ధిదారులకు అందాల్సిన డబ్బును కరోనా విజృంభణ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు అందిస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. వేలి ముద్ర స్థానంలో ఫొటో గుర్తింపుతో పింఛన్లు అందజేస్తున్నారు. దీనిపై రోజా ప్రశంసల జల్లు కురిపించారు. 
 
ఇదిలా ఉంటే, చిత్తూరు జిల్లాలో ఒక్కరోజే కరోనా కేసులు ఐదు పాజిటివ్‌గా వచ్చాయి. ఢిల్లీలో జమాతాకు వెళ్లిన 185 మందిలో 79 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. శ్రీకాళహస్తి 1, ఏర్పేడు 1, పలమనేరు 2, గంగవరం 1 పాజిటివ్‌గా వచ్చాయి. గతంలో శ్రీకాళహస్తితో కలిపి జిల్లాలో ఆరు కేసులు నమోదయ్యాయి. మరో 49 మందిని తిరుపతి పద్మావతిలోని క్వారంటైన్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments