Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాలర్ శేషాద్రి అంత్య‌క్రియ‌ల‌కు సీజె ర‌మ‌ణ - ఎమ్మెల్యే భూమన నివాళి!

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (10:28 IST)
తిరుమ‌లేశుని సేవ‌లో ఏళ్ళ త‌ర‌బ‌డి త‌రించి, చివ‌రికి ఆయ‌న సేవ‌కు విశాఖ‌కు వ‌చ్చి, కార్తీక దీపోత్స‌వం నేప‌థ్యంలో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన డాల‌ర్ శేషాద్రికి ప్ర‌ముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తిరుపతిలో నేడు డాలర్ శేషాద్రి అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి. 

 
తిరుప‌తిలోని సిరిగిరి అపార్ట్ మెంట్ వద్ద ప్రజల సందర్సనార్థం డాల‌ర్ శేషాద్రి పార్థీవదేహం ఉంచారు. ఈ మధ్యాహ్నం 2 నుంచి 3గంటల మధ్య గోవింద ధామంలో అంతిమ సంస్కారాలు చేసేందుకు ఏర్పాటు చేశారు. 
 
 
నేడు తిరుపతికి సుప్రీంకోర్టు సీజే ఎన్.వి.రమణ రానున్నారు. ఆయ‌న డాలర్ శేషాద్రి పార్థీవ దేహానికి నివాళులు అర్పించనున్నారు. ఈ ఉద‌యమే డాలర్ శేషాద్రి స్వామి పార్ధీవ దేహానికి తిరుపతి  ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కన్నీటి నివాళ్ళర్పించారు. తిరుపతిలోని డాలర్ శేషాద్రి స్వామి నివాసం వద్దకు  చేరుకుని పూలమాల‌ వేసి, పాదాలకు నమస్కరించారు. శేషాద్రి స్వామి పార్ధీవ దేహాన్ని తదేకంగా చూస్తూ , కంట తడి పెట్టారు. డాలర్ శేషాద్రి స్వామి సతీమణిని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పరామర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments