బాలికను గర్భవతిని చేసిన తాత... ఎక్కడ?

విశాఖపట్టణం జిల్లాలో ఓ తాత మృగాడయ్యాడు. అభంశుభం తెలియని ఓ బాలికపై ఒక యేడాదిగా అత్యాచారానికి పాల్పడూ వచ్చాడు. ఫలితంగా 13 యేళ్ళ బాలికను గర్భవతిని చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (10:08 IST)
విశాఖపట్టణం జిల్లాలో ఓ తాత మృగాడయ్యాడు. అభంశుభం తెలియని ఓ బాలికపై ఒక యేడాదిగా అత్యాచారానికి పాల్పడూ వచ్చాడు. ఫలితంగా 13 యేళ్ళ బాలికను గర్భవతిని చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జీవీఎంసీ 50వ వార్డు పరిధిలోని గంగవరం గ్రామానికి చెందిన యెర్రిపిల్లి నూకరాజు (53)కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరు పిల్లలకూ వివాహాలు జరిపించాడు. పైగా, ఇద్దరు మనుమలు కూడా ఉన్నారు. స్థానికంగా ఉండే మట్టిపనులకు వెళ్లే నూకరాజు.. తమ ఇంట్లోకి టీవీ చూసేందుకు వచ్చే 13 యేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ఓ యేడాదిగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో బాలికతో పాటు బాలిక శరీరంలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు.. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో వారు నిర్ఘాంతపోయే నిజం వెల్లడైంది. ఆ బాలిక ఐదు నెలల గర్భవతి అని తేలింది. దీంతో తల్లిదండ్రులు ఏం జరిగిందని అడిగేసరికి విషయమంతా చెప్పింది. బాధితులు శుక్రవారం రాత్రి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాలికను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ యేడాది జనవరి నుంచి అత్యాచారం చేస్తున్నాడని, ఇంటికి వెళ్లిన ప్రతిసారి తినడానికి ఏదో ఒకటి ఇచ్చేవాడని, అప్పుడప్పుడు రూ.20 ఇస్తుండేవాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడని బాలిక చెప్పినట్టు తెలిసింది. దీంతో నూకరాజును పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం