Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిపై మంత్రుల పొంతనలేని ప్రకటనలు.. నాదెండ్ల మనోహర్‌

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (09:06 IST)
రాజధానిపై అవగాహన లేమితో మంత్రులు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని జనసేన పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆక్షేపించారు. అన్ని రంగాలు కుదేలైపోయి, జనం అయోమయ స్థితిలో ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి మీకు నేనున్నాననే భరోసా ఇచ్చేలా ఉండాల్సిందిపోయి.. పట్టనట్లు వ్యవహరించటం బాధాకరమన్నారు.

గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. "రాష్ట్ర రాజధాని అమరావతే అనేది సుస్పష్టం. దానిని మార్చే నైతికత, అధికారం మీకు లేవు. ఇప్పటికే రూ. 8,400కోట్లు పెట్టుబడులు పెట్టిఉంటే, మరోచోటకు ఎట్లా మారుస్తారు? రోడ్లు, డ్రెయిన్లు, భవన నిర్మాణాలు జరిగాయి. వాటిలో ఏవైనా అవకతవకలుంటే కమిటీ వేసి వాటిని ధైర్యంగా ప్రజలముందు పెట్టాలి.

అంతేగాని.. పెట్టుబడి పెట్టేవారిపై కేసులు పెట్టటం ఎటువంటి సంస్కృతో మీరే చెప్పాలి. రైతులు ఏదో ఒక పార్టీకి భూములివ్వలేదు. రాజధాని కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇప్పుడు వారు తాము చేసిన త్యాగం మసిబారిపోతుందనే బాధతో ఉన్నారు. వారిని అక్కున చేర్చుకుని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకు తీసుకోరు?

పోనీ పరిపాలన విషయంలో ఏమైనా సాధించారా అంటే అదీ లేదు. ఈ వంద రోజుల్లో మీరు సాధించిందేమీ కనిపించడం లేదు. మీకైనా ఏమైనా చేశామనిపిస్తోందా" అని నిలదీశారు.

"రాష్ట్ర ప్రజలు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపిస్తే వారి సంక్షేమాన్ని పక్కనపెట్టి రాజధాని తరలింపుపై మీ మంత్రుల ప్రకటనల గందరగోళం ఏమిటి! మీరు స్పందించాల్సిన కీలక అంశంపై వారు మాట్లాడుతున్నారంటే అది మీ అసమర్థత అనుకోవాలా! లేక నిజంగానే వారి ప్రకటనల వెనుక మీ ప్రమేయం కూడా ఉందా?

అసలు రాజధాని విషయంలో మీ మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి? దీనిపై మీరు ఎందుకు స్పందించటంలేదో వెంటనే ప్రజలకు విరవణ ఇవ్వాలి" అని ప్రశ్నించారు. రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు జనసైనికులు అండగా నిలవాలని పిలుపిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments