Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణానికి స్పీడు బ్రేకర్లుగా మారుతున్న అధికారులు, మంత్రి నారాయణ తీవ్ర అసహనం

ఐవీఆర్
గురువారం, 5 డిశెంబరు 2024 (19:35 IST)
Andhra Pradesh Capital Amaravati ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఈ నగర నిర్మాణాన్ని రానున్న మూడేళ్లలోపుగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకున్నది. ఐతే ఈ పనులు చకచకా పూర్తి కావాలంటే ప్రభుత్వ యంత్రాంగం పనితీరు మెరుగ్గా వుండాలి. ఐతే కీలక పదవుల్లో వున్న అధికారులు ఏవో సాకులు చెబుతూ అనుకున్న సమయానికి మంత్రులకు అందుబాటులో వుండటంలేదట.
 
తమకు కేటాయించిన పేషీల్లో కాకుండా వేరో ఎక్కడో వెళ్లి కూర్చుంటున్నారట. వారిని వెతుక్కుంటూ వెళ్లి రాష్ట్రాభివృద్ధికై చేయాల్సిన పనులు గురించి చర్చించటం మంత్రులకు తల ప్రాణం తోకకి వస్తుందట. ఈ విషయాన్ని వారు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదులు చేస్తున్నారట. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమరావతి రాజధాని నగరాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయాల్సి వుండగా అధికారులు ఇలా బద్ధకంగానూ, తప్పించుకుని తిరగడం చర్చనీయాంశంగా మారుతోంది.
 
దీనితో అసలు ఈ అధికారులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వెనుక ఎవరి ఒత్తిడి ఏమైనా పనిచేస్తుందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మొత్తమ్మీద వచ్చే వారంలో ఎవరెవరు బద్ధకస్తులైన అధికారులు వున్నారో వారికి ఉద్వాసన పలికే అవకాశం వుందని చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments