Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణానికి స్పీడు బ్రేకర్లుగా మారుతున్న అధికారులు, మంత్రి నారాయణ తీవ్ర అసహనం

ఐవీఆర్
గురువారం, 5 డిశెంబరు 2024 (19:35 IST)
Andhra Pradesh Capital Amaravati ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఈ నగర నిర్మాణాన్ని రానున్న మూడేళ్లలోపుగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకున్నది. ఐతే ఈ పనులు చకచకా పూర్తి కావాలంటే ప్రభుత్వ యంత్రాంగం పనితీరు మెరుగ్గా వుండాలి. ఐతే కీలక పదవుల్లో వున్న అధికారులు ఏవో సాకులు చెబుతూ అనుకున్న సమయానికి మంత్రులకు అందుబాటులో వుండటంలేదట.
 
తమకు కేటాయించిన పేషీల్లో కాకుండా వేరో ఎక్కడో వెళ్లి కూర్చుంటున్నారట. వారిని వెతుక్కుంటూ వెళ్లి రాష్ట్రాభివృద్ధికై చేయాల్సిన పనులు గురించి చర్చించటం మంత్రులకు తల ప్రాణం తోకకి వస్తుందట. ఈ విషయాన్ని వారు ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదులు చేస్తున్నారట. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమరావతి రాజధాని నగరాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయాల్సి వుండగా అధికారులు ఇలా బద్ధకంగానూ, తప్పించుకుని తిరగడం చర్చనీయాంశంగా మారుతోంది.
 
దీనితో అసలు ఈ అధికారులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వెనుక ఎవరి ఒత్తిడి ఏమైనా పనిచేస్తుందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మొత్తమ్మీద వచ్చే వారంలో ఎవరెవరు బద్ధకస్తులైన అధికారులు వున్నారో వారికి ఉద్వాసన పలికే అవకాశం వుందని చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments