మానవత్వం చాటుకున్న మంత్రి పేర్ని నాని

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (08:01 IST)
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితుడికి సాయమందించి తన వాహనంలో ఆస్పత్రికి తరలించి దగ్గరుండి చికిత్స చేయించి తన మానవత్వం చాటుకొన్నారు  రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ).  
 
శుక్రవారం  పోరంకి  సమీపంలోని సైకిల్‌పై వెళ్తున్న గింజూరి రామారావు  అనే వృద్ధిడిని కారు  ఢీకొట్టింది. బాధితుడు గాలిలో పైకెగిరి  కారు అద్దాలపై పడటంతో నడుం,కాళ్ళకు బలమైన గాయాలు తగిలాయి. ఈ ప్రమాటం జరిగి  పావుగంట సమయం గడిచినప్పటికీ  క్షతగాత్రుడిని ఏ ఒక్కరు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు.

రోడ్డుపై బాధితుడు రోధిస్తున్నాడు. అదే సమయంలో ఏలూరులో ముఖ్యమంత్రి ఆరోగ్య శ్రీ కార్యక్రమమంలో పాల్గొని విజయవాడ మీదుగా మచిలీపట్నం వెళుతున్న మంత్రి పేర్ని నాని ఈ బాధితుడిని గుర్తించారు.  వెంటనే  తన కాన్వాయిని నిలిపి ప్రమాదం ఎలా జరిగిందని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

సెక్యూరిటీ సాయంతో బాధితుడ్ని తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించారు. వైద్యానికి అయ్యే ఖర్చు చెల్లించి  దగ్గరుండి వైద్యం చేయించారు.   బాధితుడు కొద్దిగా  కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన వెళ్లారు. మంత్రి పేర్ని నాని కనబర్చిన  మానవత్వం అందరికి ఆదర్శం అని స్థానికులు  ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments