Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరికీ జగన్‌ను గెలిపించాలనివుంది.. కానీ మన గుర్తు సైకిల్ అంటున్నారు : మంత్రి ధర్మాన ఆవేదన

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (08:52 IST)
వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని భావిస్తున్నారని, కానీ, మన గుర్తు ఏదని అడిగితే సైకిల్ అని చెబుతున్నారంటూ ఏపీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం శ్రీకాకుళం జిల్లాలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరికీ మళ్లీ వైకాపా అధికారంలోకి రావాలని ఉందన్నారు. కానీ, మన గుర్తు ఏదని అడిగితే సైకిల్ అని చెబుతున్నారని తెలిపారు. 
 
ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పదన్నారు. మీరు ఓటు వేసి గెలిపిస్తే వచ్చేసారీ అధికారంలోకి వస్తామని, వద్దనుకుంటే దిగిపోతామని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛనుతో హాయిగా ఉన్నామని చాలా మంది చెబుతున్నారని, మళ్లీ జగన్‌ని గెలిపిస్తామనే అంటున్నారనీ, కానీ మన గుర్తు ఏదని అడిగితే మాత్రం సైకిల్ అంటున్నారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికీ జగన్ మళ్లీ అధికారంలోకి రావాలనీ, పథకాలన కొనసాగించాలని ఉందని కానీ గుర్తేంటో మాత్రం వారికి తెలియదని పేర్కొన్నారు. కాబట్టే ఈ అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. మన దగ్గర సరిపడ కరెంట్ లేదని అందుకే కోతలు విధిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments