Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులు అవసరమైతే కాళ్లు పట్టుకుని పని చేయించుకోవాలి : మంత్రి బొత్స

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2022 (19:56 IST)
తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పరితనం ఉండాలని ఏపీ విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ప్రథమ మహా జనసభ కార్యక్రమంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులంటే ప్రభుత్వానికి వ్యతిరేకత లేదన్నారు. 
 
ఏ అంశంపైనా అయినా కూర్చొని మాట్లాడి, పరిష్కరించుకోవాలన్నదే తన విధానమన్నారు. సర్వీస్ రూల్స్ సహా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని ఆయన సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు సమస్యలను మంత్రుల ఉప సంఘంలో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. 
 
అవసరమైతే కాళ్లు పట్టుకునైనా సమస్య పరిష్కరించుకునే నేర్పు ఉద్యోగ సంఘాలకు ఉండాలని హితవు పలికారు. సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద, దండోపాయాలు సహజమేనని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా దండోపాయానికి వెళ్లడం సరికాదని మంత్రి బొత్స అన్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments