Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు వచ్చే వీఐపీలకు ఉపరాష్ట్రపతి సూచన... ఏంటది?

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ సూచన చేశారు. శ్రీవారి దర్శనం కోసం వీఐపీలు యేడాదిలో ఒక్కసారి మాత్రమే తిరుమలకు రావాలని ఆయన సూచించారు.

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:31 IST)
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ సూచన చేశారు. శ్రీవారి దర్శనం కోసం వీఐపీలు యేడాదిలో ఒక్కసారి మాత్రమే తిరుమలకు రావాలని ఆయన సూచించారు. 
 
ఆయన మంగళవారం ఉదయం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం ముగించుకున్న వెంకటేశ్వర స్వామి మీడియాతో మాట్లాడారు. ఒకసాధారణ పౌరుడిగానే స్వామిని దర్శించుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ.. వెంకన్న భక్తులు పెరుగుతున్నారని చెప్పిన వెంకయ్య.. వారందరికి దర్శనం అవకాశం సులభంగా కలగాలన్నారు.
 
వీఐపీలుగా చెలామణి అయ్యే నాయకులు పదే పదే తిరుమలకురావడం తగ్గించాలని కోరారు. స్వామి దర్శనానికి వీఐపీలు సంవత్సరానికి ఒకసారి వస్తే మిగతా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం సులభంగా కలుగుతుందన్నారు. ఇదే అంశాన్ని పరిశీలించాలని టీటీడీ అధికారులకు చెప్పానన్నారు. మరొకరు ఇబ్బంది పడుతూ మనం సంతోషంగా ఉంటే అది ఏమాత్రం మంచిది కాదన్నారు. 
 
కాగా, ఉపరాష్ట్రపతిగా మహాద్వారం నుంచి దర్శనానికి వెళ్ళాల్సి ఉన్నా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామి దర్శనానికి వెళ్లడం తనకు ఆనందాన్ని ఇస్తోందన్నారు. క్యూలైన్‍లోనే వెళ్లి దర్శనం చేసుకున్నట్టు చెప్పారు. వేంకటేశుడి ముందు అందరూ సమానులే, సామాన్యులే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments