Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎంపై మేకపాటి సంచలన వ్యాఖ్యలు.. అలాంటి నాయకుడు ఉండకూడదు..

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (17:20 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మేకపాటి రాజమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్ముకు పాలకులు ధర్మకర్తలేనని.. కానీ సొంత దారులం కాదని మేకపాటి వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్మును ప్రజలకే అప్పగించాలని సూచించిన ఆయన.. ప్రజలకు విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు ఇలా అన్ని కార్యక్రమాలు చేయాలన్నారు.
 
అసలే, రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయిందని మేకపాటి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే.. బాగా పనిచేయాలని గౌతమ్‌రెడ్డికి సూచించానని గుర్తు చేశారు. ఏపీని హైదరాబాద్‌ తరహాలో అభివృద్ధి చేయాలన్నారు. కానీ, ప్రతి దాంట్లో స్వార్థం ఉండకూడదన్నారు మేకపాటి రాజమోహన్‌రెడ్డి.
 
ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారని.. ఈ స్వల్ప కాలంలో వేలకోట్లు సంపాదించి ఏం ఉపయోగం.. తగలేసుకోవడానికా? అని మేకపాటి ప్రశ్నించారు. వైఎస్ జగన్‌ను చూస్తే మంచి నాయకత్వ లక్షణాలు వున్నాయని అనిపించేది.. వైఎస్సార్ లేని లోటు తీరుస్తానని చెప్పాను.  
 
అందుకే గత ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వండని చెప్పానని.. అయితే, ప్రజల అభిమానం పొందాలి.. కానీ, వారిని చీట్‌ చేయొద్దు.. మభ్య పెట్టడం చేయకూడదు.. అలాంటి నాయకుడు ఉండకూడదంటూ హాట్‌ కామెంట్లు చేశారు మేకపాటి. ప్రస్తుతం మేకపాటి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైనాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ చేంజర్ పైరసీ - ఏపీ లోక‌ల్ టీవీ అప్పల్రాజు అరెస్ట్

ఆకట్టుకున్న హరి హర వీరమల్లు పార్ట్-1 మాట వినాలి పాట విజువల్స్

Sankranthiki Vasthunam: గోదారి గట్టు మీద రామచిలుకవే పాటకు థియేటర్‌లో స్టెప్పులేసిన జంట

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ గురించి తెలుసా.. ఆస్తుల సంగతేంటి?

నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు : బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments