Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మకూరు (నెల్లూరు) వైకాపా అభ్యర్థిగా గౌతంరెడ్డి సతీమణి!!

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (10:51 IST)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడు, ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, ఈ స్థానం నుంచి మేకపాటి గౌతంరెడ్డి సతీమణి శ్రీకీర్తిని బరిలోకి దించాలని వైకాపా అధిష్టానం భావిస్తుంది. కానీ, ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మేకపాటు కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 
 
ఒకవేళ ఉప ఎన్నికల్లో మేకపాటి శ్రీకీర్తి పోటీ చేసిన పక్షంలో పోటీ నుంచి దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో పాటు.. జనసేన, బీజేపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం తన నిర్ణయాన్ని వెల్లడించాల్సివుంది. 
 
ఈ ఎన్నికల్లో వైకాపా కనుక శ్రీకీర్తిని బరిలోకి దింపితే తాము కొనసాగిస్తున్న ఆచారం ప్రకారం పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ భావిస్తుంది. వ్యక్తుల మృతితో ఖాళీ అయిన స్థానంలో వారి కుటుంబ సభ్యులు బరిలోకి దిగితే పోటీ చేయకూడదన్న ఆచారాన్ని టీడీపీ పాటిస్తూ వస్తుంది. 
 
ఆత్మకూరు విషయంలోనూ ఇదే నిర్ణయాన్ని అనుసరించాలని భావిస్తుంది. మరోవైపు, ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించే అంశంపై ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments