Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానికి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చిన మెగాస్టార్!

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (15:01 IST)
చిరంజీవి… తన అభిమానులను ర‌క్త సంబంధీకులుగా పోలుస్తారు. వారిని ఆపదలో ఆదుకుంటారు. కష్ట సుఖాల్లో తోడుగా నిలుస్తారు. అందుకే మెగా స్టార్‌ను.. మెగా ప్యామిలీని.. చిరు అభిమానులు ఎంతగానో అభిమానిస్తారు, ఆదరిస్తారు. అయితే తాజాగా ఓ అభిమాని కోసం మెగాస్టార్ చేసిన పని మరో సారి అందరి హృదయాల‌ను హ‌త్తుకుంటోంది. 
 
 
విశాఖకు చెందిన వెంకట్ మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తనకు చిరంజీవిని కలవాలని ఉందని ట్విట్టర్ ద్వారా వెంకట్ కోరికను తెలియజేశాడు. వెంకట్ గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అతనిని హైదరాబాద్ పిలిపించి అతనితో 45 నిమిషాలు పాటు మాట్లాడారు. అత‌ని అనారోగ్య విషయం తెలుసుకొని హైదరాబాదులోని ఒమేగా హాస్పిటల్ లో చేర్పించారు.


ఎంత ఖర్చయినా పర్వాలేదు... నా అభిమాని ఆరోగ్యం కుదుట పడాలని ఆస్పత్రి సిబ్బంది తెలియజేశారు. ఒకవేళ కావాలంటే చెన్నై లోని మెరుగైన హాస్పిటల్ కు తరలించడానికి వెనుకాడన‌ని ఈ సందర్భంగా వైద్య సిబ్బంది తెలియజేశారు చిరంజీవి.  అభిమాని గురించి,  ఈ విధంగా ఆరోగ్య విషయాలు తెలుసుకుంటున్న చిరంజీవిపై ఫ్యాన్స్ నీరాజ‌నాలు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments