Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావను పెళ్ళి చేసుకుంది, ప్రియుడితో సహజీవనం చేసింది, ఆ తర్వాత?

Married
Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (18:51 IST)
అక్రమ సంబంధాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి. అలాంటి ఘటనే విజయనగరం పట్టణంలో జరిగింది. అనారోగ్యంతో అక్క చనిపోతే బావను పెళ్ళి చేసుకున్న మరదలు.. ప్రేమను వదులుకోలేక ప్రియుడితోను సహజీవనం చేసింది. చివరకు ప్రియుడు మోసం చేశాడని తెలియడంతో తనువు  చాలించుకుంది. 
 
విజయనగరం పట్టణానికి చెందిన ఒక మహిళకు విశాఖకు చెందిన వ్యక్తితో సంవత్సరం క్రితం వివాహమైంది. అయితే ఆమె ప్రసవ సమయంలో నెల రోజుల క్రితం అపస్మారకస్థితిలోకి వెళ్ళి చనిపోయింది. అయితే ఆమె భర్త ఒంటరివాడు అయిపోతాడని భావించిన తల్లిదండ్రులు రెండో కుమార్తెను ఇచ్చి 15 రోజుల క్రితం వివాహం చేశారు.
 
తల్లిదండ్రుల మాట జవదాటని ఆ యువతి బావను పెళ్ళి చేసుకుంది. అయితే అంతకుముందే రెండునెలల క్రితం నుంచి అదే ప్రాంతానికి చెందిన రాజేంద్రనాథ్‌తో యువతి పీకల్లోతు ప్రేమలో ఉంది. అతనితో శారీరకంగా బాగా దగ్గరైంది. రాజేంద్రనాథ్ ఆటో డ్రైవర్‌గా ఉండేవాడు.
 
వివాహమైన తరువాత కూడా ప్రియుడిని వదిలి ఉండలేకపోయింది. తన భర్తతో ఐదురోజుల క్రితం గొడవపెట్టుకుని రాజేంద్రనాథ్‌తో వెళ్ళిపోయింది యువతి. రెండు రోజులుగా రాజేంద్రనాథ్‌లో మార్పు రావడం.. వేరొక యువతితో అతను సన్నిహితంగా ఉండటం గమనించింది యువతి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. నిన్న రాత్రి రాజేంద్రనాథ్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు రాజేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments