Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త స‌ర్పంచుల‌కు తెలియ‌కుండా ఆర్ధిక సంఘం నిధులు వాడేశారు...

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (13:04 IST)
కృష్ణా జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామపంచాయతీ ముందు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు నిరసన దీక్ష చేపట్టారు. కొత్తగా గ్రామ సర్పంచులుగా ఎన్నిక‌యిన  సర్పంచులకు తెలియకుండా గ్రామపంచాయతీ 14, 15 ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నందుకు నిరసన దీక్ష చేపట్టారు.

 
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు జమ చేయాల‌ని డిమాండు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామపంచాయతీలు రావాల్సిన నిధులను నేరుగా గ్రామపంచాయతీ అకౌంట్లో జమ చేయాల‌ని కోరారు. కొత్తగా బ్యాంక్ అకౌంట్ లో గ్రామ సర్పంచ్ ఒక్కరికే చెక్ పవర్ కల్పించాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు.  

 
గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాల‌ని, గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు కూడా వెంటనే విడుదల చేయాల‌ని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావిచర్ల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments