Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి తెదేపా ప్రధాన కార్యాలయానికి కరోనా నోటీసులు!

Webdunia
బుధవారం, 27 మే 2020 (18:37 IST)
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో వుంది. ఈ భవనాన్ని కొత్తగా నిర్మించారు. ఈ భవనం నుంచి పార్టీపరంగా అన్ని రకాల కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ కార్యాలయానికి కోవిడ్ నోటీసులు జారీచేశారు. 
 
మహానాడు జరుగుతున్నందున కార్యాలయంలో కరోనా నివారణ చర్యలను తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. మంగళగిరి తహసీల్దార్ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. టీడీపీ కార్యాలయ సెక్రటరీ రమణకు ఆత్మకూరు వీఆర్వో ఈ నోటీసులు అందించారు.
 
కాగా, బుధవారం, గురువారం రెండు రోజుల పాటు తెదేపా మహానాడు జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే, కరోనా నేపథ్యంలో ఈ మహానాడును కూడా డిజిటల్ మహానాడుగా జూమ్ యాప్‌లో నిర్వహిస్తోంది. 
 
దీంతో పార్టీ శ్రేణులంతా తమతమ ఇళ్ళలో ఉంటూ ఈ మహానాడును ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్నారు. కాగా, ఎన్టీఆర్ జయంతి వేడుకలు మే 28వ తేదీని పురస్కరించుకుని ఈ మహానాడును ప్తి యేటా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments