Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి తెదేపా ప్రధాన కార్యాలయానికి కరోనా నోటీసులు!

Webdunia
బుధవారం, 27 మే 2020 (18:37 IST)
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో వుంది. ఈ భవనాన్ని కొత్తగా నిర్మించారు. ఈ భవనం నుంచి పార్టీపరంగా అన్ని రకాల కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ కార్యాలయానికి కోవిడ్ నోటీసులు జారీచేశారు. 
 
మహానాడు జరుగుతున్నందున కార్యాలయంలో కరోనా నివారణ చర్యలను తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. మంగళగిరి తహసీల్దార్ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. టీడీపీ కార్యాలయ సెక్రటరీ రమణకు ఆత్మకూరు వీఆర్వో ఈ నోటీసులు అందించారు.
 
కాగా, బుధవారం, గురువారం రెండు రోజుల పాటు తెదేపా మహానాడు జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే, కరోనా నేపథ్యంలో ఈ మహానాడును కూడా డిజిటల్ మహానాడుగా జూమ్ యాప్‌లో నిర్వహిస్తోంది. 
 
దీంతో పార్టీ శ్రేణులంతా తమతమ ఇళ్ళలో ఉంటూ ఈ మహానాడును ఆన్‌లైన్‌లో వీక్షిస్తున్నారు. కాగా, ఎన్టీఆర్ జయంతి వేడుకలు మే 28వ తేదీని పురస్కరించుకుని ఈ మహానాడును ప్తి యేటా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments