Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అభివృద్ధి కోసం రాజధాని మార్పును స్వాగతిస్తా : మంగళగిరి ఎమ్మెల్యే

అభివృద్ధి కోసం రాజధాని మార్పును స్వాగతిస్తా : మంగళగిరి ఎమ్మెల్యే
, గురువారం, 26 డిశెంబరు 2019 (13:16 IST)
వ్యక్తిగత పనులపై వేరే ఊరికి వెళితే తాను కనిపించడం లేదంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఇంత రాద్దాంతం చేస్తారా అంటూ వైకాపాకు చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతిపై రైతులు ఆందోళనలు కొనసాగిస్తుంటే వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎక్కడ అంటూ విమర్శలు వచ్చాయి. ఇదే అంశంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆయన గురువారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తాను సొంత పనులపై నాలుగు రోజులు హైదరాబాదుకు వెళ్లానని... దీనిపై ఇంత రాద్దాంతం చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. 40 ఏళ్లుగా చంద్రబాబు కనిపించడం లేదని కుప్పం ప్రజలు చెబుతున్నారని... దీనికి తెలుగుదేశం పార్టీ నేతలు సమాధానం చెప్పాలని ఆర్కే డిమాండ్ చేశారు. 
 
ఈనెల 17న శాసనసభలో రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారని... ఆ తర్వాత కొన్ని రోజులు తాను ఇక్కడే ఉన్నానని ఆర్కే చెప్పారు. చాలా కాలం తర్వాత తమ కుటుంబంలో ఒక వివాహం జరగబోతోందని... ఆ పనులపైనే తాను హైదరాబాదుకు వెళ్లానని తెలిపారు. రైతు సంక్షేమం కోసం పాటుపడే పార్టీ వైసీపీ అని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలనంతా ఒకే చోట ఉండాలి.. అడిగితే కేంద్రానికి ఇదే చెబుతా : వెంకయ్య