Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై.. అత్యాచారయత్నం.. తల్లి రావడంతో?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (17:50 IST)
నేరాలలో హైదరాబాద్‌కి ధీటుగా ఏదీ పోటీపడదనిపిస్తోంది. భాగ్య నగరంలో జరిగే దారుణాలు అన్నీ ఇన్నీ కావు. రోజుకు ఒక క్రైమ్ న్యూస్ అయినా అక్కడ నుండి వస్తోంది. కొన్నిరోజుల క్రితం లోయర్ టాంక్ బండ్ సమీపంలో గంజాయి మత్తులో ఓ వ్యక్తి మైనర్ బాలికపై చేసిన దారుణచర్యను మరువక ముందే మరో దారుణం వెలుగుచూసింది. 
 
హైటెక్ సిటీ సైబర్ టవర్స్‌కు సమీపంలో ఉన్న మాదాపూర్ పర్వతనగర్ ఏరియాలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. సమయానికి అక్కడికి తల్లి రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ జంట తమ ఎనిమిదేళ్ల కూతురితో కలిసి మాదాపూర్ పర్వతనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పాప ఆడుకుంటూ పైన ఉన్న యజమాని ఇంటికి వెళ్లింది. 
 
అప్పుడు ఒంటరిగా ఉన్న యజమాని చక్రవర్తి పాపపై అఘాయిత్యం చేయబోయాడు. బాలిక అరవకుండా నోరు మూసాడు. ఆ సమయంలో తల్లి పాపను వెతుక్కుంటూ పైకి వచ్చింది. విషయం గమనించిన తల్లి అతడిని చితకబాదింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చక్రవర్తిని అరెస్ట్ చేసారు. అతనిపై నిర్భయ, అట్రాసిటీ, అత్యాచార యత్నం చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments