కుమారుడిని మందలించిన పాపానికి తండ్రి హత్య

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (14:29 IST)
చెడు వ్యసనాలకు అలవాటు పడిన కుమారుడిని మందలించిన పాపానికి తండ్రి హత్యకు గురైనాడు. మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న కన్న తండ్రినే కొడుకు కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఈ హృదయ విధారక ఘటన జిల్లా వాసులను తీవ్రంగా కలచి వేసింది. 
 
కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కోసిగి నాల్గవ వార్డులో అల్లమ్మ, వీరయ్య దంపతులు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. వీరి పెద్దకుమారుడు నరసింహులు చదువు మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో మద్యంకు బానిస అయ్యాడు.
 
నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి ఆ మత్తులో తల్లిదండ్రులను వేధించేవాడు. కొడుకుకు బుద్ది చెప్పాలని తండ్రి వీరయ్య కొడుకు నరసింహులను పలుమార్లు మందలించాడు.
 
ఇలా తరచూ తండ్రి మందలిస్తుండడంతో మద్యం మత్తులో గొడ్డలితో తండ్రి గొంతుపై నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడును అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments