Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి పంచివ్వలేదని తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు...

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (19:20 IST)
కన్న కొడుకులకు ఆస్తి పంచితే తమను చూసుకోరనే ఉద్దేశంతో పంపకాన్ని వాయిదా వేసిన తల్లిదండ్రులను, దారుణంగా పెట్రోలు పోసి కాల్చాడు ఓ కొడుకు. వారి హాహాకారాలకు చుట్టుప్రక్కల వారు తరలివచ్చారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 
 
కణేకల్‌లోని రామ్‌నగర్ కానీలో కుటుంబంతోపాటు నివసిస్తున్న నారాయణరెడ్డి, నరసమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారికి వంశపార్యంపరంగా వస్తున్న ఒక ఎకరా భూమిని, సొంత ఇంటిని పంచి ఇవ్వలేదని కోపంతో ఉన్నారు. పంచిపెట్టమని వారిపై పదేపదే ఒత్తిడి తేసాగారు. అయితే ఆస్తి పంచితే వారిని బాగా చూసుకోరనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పంపకాన్ని వాయిదా వేస్తూవచ్చారు. 
 
ఈ తీరు నచ్చని చిన్న కొడుకు మధుసూదన్ రెడ్డి, తల్లిదండ్రులపై మరింత ఒత్తిడి చేశాడు. వారు ససేమిరా కాదనటంతో కోపానికి లోనయ్యాడు. ఆదివారం వారు ఒంటరిగా ఉండగా వారిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. తనతోపాటు తెచ్చిన పెట్రోలును వారిపై పోసి నిప్పంటించాడు. శరీరం కాలి వారు బాధతో అరుస్తుంటే చుట్టుప్రక్కల వారు పరుగున వచ్చారు. వెంటనే మంటలు ఆర్పి బాధితులను బళ్లారి ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. దాడికి దిగిన మధుసూదన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments