Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి పంచివ్వలేదని తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు...

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (19:20 IST)
కన్న కొడుకులకు ఆస్తి పంచితే తమను చూసుకోరనే ఉద్దేశంతో పంపకాన్ని వాయిదా వేసిన తల్లిదండ్రులను, దారుణంగా పెట్రోలు పోసి కాల్చాడు ఓ కొడుకు. వారి హాహాకారాలకు చుట్టుప్రక్కల వారు తరలివచ్చారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 
 
కణేకల్‌లోని రామ్‌నగర్ కానీలో కుటుంబంతోపాటు నివసిస్తున్న నారాయణరెడ్డి, నరసమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వారికి వంశపార్యంపరంగా వస్తున్న ఒక ఎకరా భూమిని, సొంత ఇంటిని పంచి ఇవ్వలేదని కోపంతో ఉన్నారు. పంచిపెట్టమని వారిపై పదేపదే ఒత్తిడి తేసాగారు. అయితే ఆస్తి పంచితే వారిని బాగా చూసుకోరనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పంపకాన్ని వాయిదా వేస్తూవచ్చారు. 
 
ఈ తీరు నచ్చని చిన్న కొడుకు మధుసూదన్ రెడ్డి, తల్లిదండ్రులపై మరింత ఒత్తిడి చేశాడు. వారు ససేమిరా కాదనటంతో కోపానికి లోనయ్యాడు. ఆదివారం వారు ఒంటరిగా ఉండగా వారిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. తనతోపాటు తెచ్చిన పెట్రోలును వారిపై పోసి నిప్పంటించాడు. శరీరం కాలి వారు బాధతో అరుస్తుంటే చుట్టుప్రక్కల వారు పరుగున వచ్చారు. వెంటనే మంటలు ఆర్పి బాధితులను బళ్లారి ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. దాడికి దిగిన మధుసూదన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments