చనిపోయాడని పాడెపై మోసుకెళ్తుంటే.. లేచి కూర్చున్నాడు..

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (17:53 IST)
మరణించిన వ్యక్తులు శ్మశానాల్లో లేవడం.. వాళ్లకు ఊపిరి రావడం వంటి సంఘటన గురించి వినే వుంటాం. తాజాగా అలాంటి ఘటనే చిత్తూరులో చోటుచేసుకుంది.  చనిపోయాడనుకున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి కూర్చుని అందరికీ షాకిచ్చాడు. ఈ ఘటన చితూర్తు జిల్లాలోని మదనపల్లెలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఓ వ్యక్తి మండలంలోని కట్టుబావి గ్రామంలో చెట్టు కింద రెండు రోజులుగా అపాస్మారక స్థితిలో పడి ఉన్నాడు.
 
ఈ విషయాన్ని గ్రామస్తులు గ్రామకార్యదర్శి మనోహర్‌, వీఆర్వో నాగరాజుకు తెలిపారు. వీరు అక్కడికి చేరుకుని చనిపోయాడని భావించారు. దీంతో ఊరికి సమీపంలో గుంతను తవ్వించి, పాడెపై మోసుకెళ్తున్నారు. ఇంతలో హఠాత్తుగా ఒక్కసారిగా పాడెపై ఉన్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. దీంతో అవాక్కయిన స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించారు. అయితే.. ఆ వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments