Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్ణీత కాల వ్యవధిలోనే లబ్ధిదారులకు అందాలి : జాయింట్ కలెక్టర్

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (16:13 IST)
రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని నిర్ణీత కాలవ్యవధిలోనే లబ్ధిదారులకు అందించాలని జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత అన్నారు. మంగళవారం కృష్ణా జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత పామర్రు తాహశీల్దారు సురేష్ బాబుతో కలసి పామర్రు మండలం పెదమద్దాలి, అడ్డాడ, కోమరవోలు గ్రామాల్లోని సచివాలయాలను సందర్శించారు. 
 
ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి సూచనలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను పూర్తి స్థాయిలో అర్ధం చేసుకుని నిర్ణీత కాలవ్యవధిలోనే లబ్ధిదారులకు అందించాలన్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు సమయపాలన పాటిస్తూ అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. 
 
ఈ నెల 25వ తేదీన అర్హులైన లబ్ధిదారులకు అందించే ఇళ్లస్థల పట్టాల పంపిణీ ప్రక్రియకు సంభందించిన వివరాలను అడిగి తెలుసుకుంన్నారు. అదేవిధంగా జగనన్న చేయూత, జగనన్న తోడు, ఆసరా, నాడు - నేడు పనులపురోగతి పై శాఖల వారి పర్సన్ అసిస్టెంట్లు నిర్వహిస్తున్న రిజిస్ట్రలను పరిశీలించారు. 
 
రైస్ కార్డ్స్ మరియు ప్రభుత్వం అందించే పథకాలకు సంభందించి నిర్ణీత వ్యవధిలోనే దరఖాస్తులు చేసిన ప్రజలుకు సమాదానాలు తెలియజేస్తూ జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ కె.మాధవి లత ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వెంట తహసిల్దార్ సురేష్ బాబు, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది వున్నారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments