Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఐసోలేషన్ వార్డ్ లో 'మైత్రీ'

Webdunia
ఆదివారం, 24 మే 2020 (23:26 IST)
సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్, హర్షా అకాడమీ వారి సం యుక్త  ఆధ్వర్యంలో రూపొందించబడిన ''మైత్రీ'' అనబడే రోబోను ఆదివారం కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్  ఆవిష్కరించారు. 
 
ఈ రోబోను హైదరాబాద్ కు చెందిన 'సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్ ' చైర్మన్  ఫణికుమార్  ఆధ్వర్యంలో ఆ సంస్థ టెక్నికల్ హెడ్ దుర్గాప్రసాద్ రూపొందించారు. ఈ రోబోను ముఖ్యంగా ఐసోలేషన్ వార్డ్ లో చికిత్సపొందుతున్న కరోనా భాధితుల సహాయార్థం రూపొందించటం జరిగినట్లుగా దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.
 
మైత్రీ రోబోను ఆదివారం హార్ష అకాడమీ డైరెక్టర్   తనూజ్ కుమార్  కలెక్టర్ ఇంతియాజ్ కు అందచేసారు.ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యసేవలకు  ఎంతగానో ఉపయోగపడే రోబోను తయారుచేసి అందచేసినందుకు సర్క్యూట్ గ్రిడ్  ను, హర్షా అకాడమీ వారిని కలెక్టర్ అభినందించారు.

జిల్లాలో వీటిని వినియోగిo చుకునేందు రెండు రోబోలను ఉచితంగా అందించిన హర్ష అకాడమీ, సర్క్యూట్ గ్రిడ్ వారిని కలెక్టర్ అభినందించారు.

ఈ సంధర్భంగా రోబో పనితీరును  సర్క్యూట్ గ్రిడ్ టెక్నికల్ హెడ్ దుర్గాప్రసాద్ వివరిస్తూ ఈ మైత్రీ రోబో వైఫై టెక్నాలజీతో పనిచేస్తుందనీ, దీనిని 20 అడుగుల దూరం నుండి  మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తూ కరోనా రోగులకు ఆహారం ,మందులు అందించవచ్చని, తద్వారా వైద్యసిబ్బంది కరోనా వైరస్ బారినపడకుండా కాపాడవచ్చని  తెలిపారు.

తమసంస్థ సర్క్యూట్ గ్రిడ్ రోబోల తయారీనే కాకుండా హోం ఆటోమేషన్ ఇండస్ట్రీలో కూడా సేవలు అందిస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments