Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచిత బియ్యం స్థానంలో రాగుల పంపిణీ.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 31 మే 2023 (13:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యం స్థానంలో రాగులను పంపిణీ చేయనున్నారు. రాయలసీమలోని కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని రేషన్ కార్డులపై ఉచిత బియ్యం, సబ్సిడీ కందిపప్పు, చెక్కరతోపాటు వచ్చే నెల నుంచి రాగులను కూడా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ తెలిపారు. 
 
ఉచిత బియ్యానికి బదులు ఒక్కొక్క కార్డుపై గరిష్టంగా 3 కేజీల వరకు రాగులను ఉచితంగానే అందజేస్తామని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాగులు వద్దనుకునే కార్డుదారులు యధావిధిగా మొత్తం బియ్యం తీసుకోవచ్చని వివరించారు. రాయలసీమలోని ఇతర జిల్లాల్లో జూలై నుంచి రాగుల పంపిణీ ప్రారంభిస్తామని, దశలవారీగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకూ విస్తరిస్తామని తెలిపారు. 
 
2023ను మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో అధిక పోషక విలువలు కలిగిన బలవర్థకమైన చిరుధాన్యాలను పేదలకు అందించాలనే ఉద్దేశంతో రేషన్ కార్డుదారులకు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే నంద్యాల జిల్లాలో జొన్నలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెల నుంచి రాగుల పంపిణీ కూడా చేపట్టనున్నామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 1967 టోల్‌ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments