Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అగ్నిగుండంలా ఆంధ్రప్రదేశ్.. నేడు రేపు వడగాడ్పులు...

heat waves
, ఆదివారం, 28 మే 2023 (09:15 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సూర్యతాపంతో ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా ఏపీ అగ్నిగుండంలా మారింది. అనేక ప్రాంతాల్లో పగడి ఉష్ణోగ్రతలు ఏకంగా 44 డిగ్రీలు దాటేశాయి. శనివారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లె మండలం చిన్నయ్యగూడెంలో 44.9 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6, బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు, ఏలూరు జిల్లా పెదవేగిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో 44 డిగ్రీలు, 13 ప్రాంతాల్లో 43 డిగ్రీలు, 3 చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం 35 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ఆదివారం 73 మండలాల్లో, సోమవారం 12 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 
 
అధికంగా గుంటూరులో 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, ఎన్టీఆర్‌ జిల్లాలో 10 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగతా చోట్ల ఎండ తీవ్ర ప్రభావం చూపనుందని పేర్కొంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యాహ్న భోజనంలో పాము... విద్యార్థులకు అస్వస్థత