Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రైనా రావాల్సిందే.. స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వదల్చుకోలేదు : ధర్మాబాద్ కోర్టు

బాబ్లీ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు తోసిపుచ్చింది. పైగా, కీలక వ్యాఖ్యలు చేసింది. బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసుపై ధర్మాబాద

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (13:16 IST)
బాబ్లీ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు తోసిపుచ్చింది. పైగా, కీలక వ్యాఖ్యలు చేసింది. బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసుపై ధర్మాబాద్‌ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఆ సమయంలో రీకాల్ పిటిషన్ తిరస్కరణకు గురైనందువల్ల కోర్టుకు హాజరయ్యేందుకు కొంతసమయం కావాలంటూ సీఎం తరపు న్యాయవాది కోరారు.
 
ఆ తర్వాత ధర్మాబాద్ కోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టానికి ఎవరూ మినహాయింపు కాదని, ముఖ్యమంత్రైనా.. ఎవరైనా కోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని, ఎవరికీ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వదల్చుకోలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు సహా 16 మంది నేతలు.. అక్టోబర్ 15న కోర్టులో హా1జరుకావాలని జడ్జి ఆదేశించారు.
 
మరోవైపు ఈ కేసులో వారెంట్ అందుకున్న అప్పటి తెలంగాణ టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నంకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాబాద్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments