Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగిరిప‌ల్లిలో వైభ‌వంగా మహబూబ్ సుభాని ఉరుసు మ‌హోత్స‌వం

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (13:13 IST)
కృష్ణా జిల్లా ఆగిరిప‌ల్లిలో ఉరుసు మ‌హోత్స‌వం వైభవంగా జ‌రిగింది. మ‌త పెద్ద‌లు గంధంతో ఊరేగింపుగా  బయలుదేరి, మహబూబ్ సుభాని ఉరుసు గంధం మహోత్సవంలో పాల్గొన్నారు. ఆగిరిపల్లి హైస్కూల్ రోడ్లోని హజరత్ మహబూబ్ సుభాని దర్గా నిషాని వద్ద మహబూబ్ సుభాని ఉరుసు, గంధ మహోత్సవం వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు.
 
 
దర్గాలోని మహబూబ్ సుభానినీ ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజించారు. దర్గా నుండి ఉరుసు గంధంతో బయలుదేరిన వాహనం ముందు మేళ తాళాలు, డప్పు వాయిద్యాలతో పెద్ద ఎత్తున ముందు గుండు సామాగ్రి కాల్చుకుంటూ గ్రామంలోని నాలుగు ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. గంధం తీసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారు. ఆగిరిపల్లి పుర వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. 
 
 
ఎస్ఎస్ పబ్లిషర్స్ యజమాని షేక్ షాజహాన్ నేతృత్వంలో దర్గా కమిటీ సభ్యులు, ముజావర్ పటాన్ బి బి జాన్, పఠాన్ సుభాని పర్యవేక్షణలో ఉరుసు, గంధ మహోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. మ‌త సామ‌ర‌స్యాన్ని అల‌వ‌రుచుకున్న ఆగిరిప‌ల్లి వాసులు అంద‌రూ, మ‌తాత‌ల‌కు అతీతంగా ఈ ఉరుసు ఉత్స‌వంలో పాల్గొన‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments