Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్యాస్ లీక్: ముగ్గురు వ్యక్తులను పొట్టనబెట్టుకున్న సిలిండర్

Advertiesment
Three people
, సోమవారం, 22 నవంబరు 2021 (11:29 IST)
నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో ఘోరం జరిగింది. ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
 
గ్యాస్ లీక్ అవుతుందన్న విషయాన్ని పసిగట్టలేకపోవడంతో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అబ్బాస్, అతడి భార్య సౌషద్ అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. తీవ్ర గాయాలపాలైన వారి కుమార్తె అయేషా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెజ‌వాడ‌కు జాతీయ స్థాయిలో బెస్ట్ క్లీనెస్ట్ సిటీ అవార్డు