ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ దూరం?

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (13:02 IST)
స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండడంతో గులాబీ పార్టీలో సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్సీలకు ఈసారి అవకాశం దక్కే సూచనలు లేవని తెలుస్తోంది. ఈ ఎన్నికలకు బీజేపీ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ఇప్పటికే ఈ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై పీసీసీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ విషయంపై  దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై పార్టీ నేతలతో చర్చించామని తెలిపారు. 
 
ఎన్నికల్లో డబ్బు ప్రభావం పై కూడా చర్చ జరిగిందని, ఇంకా కొంతమంది నేతల అభిప్రాయం సేకరించాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ నిర్ణయం హైకమాండ్​కు తెలిపి, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై  ప్రకటిస్తామని వివరించారు. 
 
ఎన్నికల్లో అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు తో ఓటర్ల ను  ప్రలోభపెడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన లోకల్ బాడీ నేతలలో సగం మందిని అధికార పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నుంచి పోచంపల్లి సోమవారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments