Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను గెలిపించండి.. మీకు అందుబాటులో వుంటా.. మాధవీలత

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:34 IST)
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సినీ నటి మాధవీలత తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో వుంటానని.. చెప్పుకొచ్చారు. తనను గెలిపిస్తే ప్రజా సేవ చేసుకుంటానని, ఓడిపోతే, బీజేపీ నిర్ణయం ప్రకారం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడతానని అన్నారు. 
 
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్నాయని, డ్రైనేజీ, మంచినీరు, పెన్షన్లు వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారం కోసం ఎక్కిడికి వెళ్లినా వాళ్లింటి అమ్మాయిగానే భావిస్తున్నారని.. తన గెలుపు ఖాయమని మాధవీలత ధీమా వ్యక్తం చేశారు.
 
సినీ నటులంతా వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో.. జాతీయ పార్టీతో మేలెంతో వుంటుందనే బీజేపీలో చేరానని.. ప్రాంతీయ పార్టీని ఎంచుకుంటే ఓ ప్రాంతానికే పరిమితం అవుతామని మాధవీలత వ్యాఖ్యానించారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీల్లో నైతిక విలువలు కనిపించట్లేదని మాధవీలత తెలిపారు. ఇకపోతే.. గుంటూరు బీజేపీ పశ్చిమ అభ్యర్థిగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments