Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో మరో మదనపల్లి ఘటన : దేవుడి వద్దకు వెళుతున్నాననీ...

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (08:02 IST)
మదనపల్లిలో మూఢనమ్మకం ఇద్దరు ఆడపిల్లలను కన్నతల్లిదండ్రులే హత్య చేశారు. ఈ ఇద్దరు మృతులు అలేఖ్య, సాయిదివ్య అనే అక్కాచెల్లెళ్లు. తమ కుమార్తెలు దేవుడి వద్దకు వెళ్లారనీ, వారు మళ్లీ తిరిగి వస్తారని ఆ దంపతులు చెబుతున్నారు. పైగా, తాను దేవుడినని తనకు కరోనా పరీక్షలు ఎందుకు అంటూ ఆ కుమార్తెలను తల్లి చెబుతోంది. ఈ జంట హత్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఈ ఘటన మరచిపోకముందే.. చిత్తూరు జిల్లా ఇలాంటి ఘటనే ఒకటి ఇదే జిల్లాలో మరొకటి వెలుగు చూసింది. 
 
జిల్లాలోని గంగవరం మండలానికి చెందిన గణేశ్ అనే యువకుడు డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. తాను దేవుడి వద్దకు వెళుతున్నానంటూ లేఖ రాసి కనిపించకుండా పోయాడు. ఈ నెల 21 నుంచి అతడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. మదనపల్లె ఘటన నేపథ్యంలో తమ బిడ్డకు ఏమీ జరగకూడదని వారు ప్రార్థిస్తున్నారు.
 
కాగా, అదృశ్యమైన యువకుడికి భక్తి భావాలు మెండుగానే ఉన్నా, మరీ మూఢత్వం స్థాయిలో లేవని బంధువులు చెబుతున్నారు. కానీ, మదనపల్లె ఘటనను దృష్టిలో ఉంచుకుని వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments