Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ఆర్థిక సదస్సులో లోకేశ్

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (06:51 IST)
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ దిల్లీలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో​ పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు డేటా వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణపై ఈ సమావేశంలో లోకేశ్​ చర్చించారు.

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై పలువురు వక్తలు తమ అభిప్రాయలను తెలియజేశారు. దేశ రాజధాని దిల్లీలో ప్రపంచ ఆర్థిక సదస్సు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సదస్సులో యంగ్ గ్లోబల్ లీడర్ హోదాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పాల్గొన్నారు.

అప్పట్లో పంచాయతీ రాజ్, ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో ఆధునికత సాంకేతికతో సాధించిన వృద్ధి, గ్రామాల అభివృద్ధి, తాగునీటి సరఫరా కార్యక్రమాలను చూసి ఎకానమిక్​ ఫోరం ఆయనను యంగ్​ గ్లోబల్​ లీడర్​గా గుర్తించింది.

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు డేటా వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణపై జరిగిన చర్చలో నారా లోకేశ్​ పాల్గొన్నారు.

దేశంలోని నగరాల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్రపంచ వ్యాప్తంగా తక్కువ ఖర్చుతో పారిశుద్ధ్య నిర్వహణకి అనుసరిస్తున్న విధానాలపై ఇందులో చర్చించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments