Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థానిక ఎన్నికల ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: ఏపీసీసీ అధ్య‌క్షుడు శైలజానాధ్

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (11:27 IST)
పంచాయతీలను ఏకగ్రీవాలు చేయాలనడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ పేర్కొన్నారు. చాలా రాద్ధాంతాల మధ్య ఎట్టకేలకు పంచాయితీ నామినేషన్‌ల ప్రక్రియ మొదలైందని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికలను ఆహ్వానిస్తోందన్నారు.

తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మంత్రులకు ఏకగ్రీవాలు చేయాలని బాధ్యతలు ఇవ్వడాన్ని తొలి సారిగా చూస్తున్నాం.. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం, పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసింది కాంగ్రెస్  అని గుర్తు చేశారు. గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా,ఇవి రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అని చెప్పారు.

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ప్రజల ముందు ఉన్నాయని.. వీటిని రైతులంతా వ్యతిరేకిస్తున్నారని శైలజనాధ్  చెప్పారు. రైతు చట్టాలపై కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. కేంద్రం రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని శైలజనాధ్  డిమాండ్ చేశారు. 

వైసీపీ ఆ మూడు వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇచ్చి ఓట్ వేశారు, రైతులకు ఉరి తాడు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంబానీ ఆదానిలకు వ్యవసాయాన్ని ధారాదత్తం చేసే బిల్లులని మండిపడ్డారు. అనంతపురంలో కాంట్రాక్ట్ వ్యవసాయం జరుగుతుందన్నారు.

12 వందల అడుగుల లోతు వెళ్లిన నీళ్లు రావట్లేదని శైలజనాధ్  ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో నీళ్ల కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దుర్మార్గపు చట్టాలకు మద్దతు ఇచ్చిన సీఎం జగన్మోహనరెడ్డి‌ని  స్థానిక ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.విద్యుత్ సంస్కరణల ద్వారా మోటార్లకు మీటర్లు పెడతామని జగన్మోన్ రెడ్డి చెప్పారన్నారు.

ఇది రైతులను భయభ్రాంతులకు గురి చేసే అంశమని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పొరపాటున వైసీపీ అభ్యర్థులు గెలిస్తే , మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నట్టే అని మీటర్లు పెడతారని.. వారిని ఓడించాలని ప్రజలకు శైలజనాధ్  సూచించారు. రాష్ట్రం స్థానం లేని మతతత్వ పార్టీ, వారి స్నేహితులు, మతాల విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ఇప్పటికే మతతత్వ పార్టీని ప్రజలు రాష్ట్రంలో తిప్పి కొట్టారు, ఈ ఎన్నికల్లో కూడా తిప్పికొట్టాలన్నారు. రాబోయే రోజుల్లో చాలా సమస్యలు రానున్నాయి, ఆలోచించి మంచివారికి ఓట్ వేసి గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు, నామినేషన్లు  వేస్తున్నారని శైలజనాధ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments